లోన్ రీ పేమెంట్ పై తాత్కాలిక మారటోరియాన్ని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 28 వరకు పొడిగించింది. మధ్యంతర ఉత్తర్వులు కొనసాగిస్తున్నందునఈ కాలంలో వాయిదా లుచెల్లించని ఏ రుణాన్నీ ఎన్పిఎ (నిరర్ధక ఆస్తి) గా ప్రకటించవద్దంటూ సుప్రీంకోర్టు గురువారం రుణ తిరిగి చెల్లింపుపై తాత్కాలిక మారటోరియాన్ని సెప్టెంబర్ 28 వరకు పొడిగించింది.
కోవిడ్ -19 సంక్షోభం నేపథ్యంలో రుణగ్రహీతలకు సహాయపడటానికి అమలు చేసిన ఈ పథకం గడువు ఆగస్టు 31 తో ముగిసింది. మారటోరియం అమలులో ఉన్నకా లంలో వడ్డీ వసూలు చేయకూడదన్న పిటిషన్ను పరిగణనలోకి తీసుకోవాలని ఉ న్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని కోరింది. రుణదాతలు లేవనెత్తిన అన్న అంశాల పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తో సంప్రదించి ఓ నిర్ణయానికి రావాలని సుప్రీం కోర్టు ప్రభుత్వానికి తెలిపింది.
’రుణ కేసులలో కాంపౌండ్ వడ్డీ వసూలు చేస్తున్నారు ఇక ఉపశమనం ఎక్కడ ఉంది? రుణాలు రి స్ట్రక్చర్ అవుతున్నాయి..దానిని ఇంతకు ముందే చేయాల్సి వుండాల్పింది‘ అనిరుణ గ్రహీతల తరపు న్యాయవాది రాజీవ్ దత్తా అన్నారు. “లక్షలాది మంది ప్రజలు ఆసుపత్రులలో ఉన్నారు, చాలా మంది ప్రజలు తమ ఆదాయ వనరులను కోల్పోయారు. ఉపశమనం , మరటోరియం, వడ్డీపై వడ్డీని వదులుకోవడం తదితర అంశాలపై ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలి‘ అని దత్తా అన్నారు.
This web site is really a walk-through for all of the info you wanted about this and didn’t know who to ask. Glimpse here, and you’ll definitely discover it.
just right article, i love it